బెజవాడ లులు మాల్.. వెనుక మతలబు వింటే షాక్..

కూటమి ప్రభుత్వం  లులు మాల్కు రెడ్ కార్పెట్ వేసింది జగన్ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయిన ఈ మాల్ కూటమి రాగానే తిరిగి వచ్చింది విశాఖలో అత్యంత విలువైన భూమిని ఇప్పటికే ప్రభుత్వం కట్టబెట్టింది మరో మారు విజయవాడ నడిబొడ్డులో వందల కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు రెడీ అయింది . దీనిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది.
విజయవాడలో లులు మాల్‌ ఏర్పాటు కానుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లులు గ్రూప్ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. లులు గ్రూప్ సంస్థ విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా కలిపి 1,222 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతోపాటు 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో విజయవాడలో లులు సంస్థ మాల్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (APIIC) పరిశీలన చేసింది.

చివరకు గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్‌ కిశోర్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఇటీవల లేఖ రాశారు. ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఆ స్థలాన్ని లులు మాల్‌కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్లు సమాచారం.

5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ డిపో: గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో సుమారు 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ గవర్నర్‌పేట-2తో పాటు, ఒకటో డిపోకి చెందిన బస్సులను కూడా ఉంచుతారు. 1, 2 ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు సైతం ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమిని లులు మాల్‌ కోసం ఇస్తే, ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి 5 ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను సైతం ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం గురువారం జరగగా, అందులో లులు గ్రూప్ సంస్థ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐరన్‌ స్క్రాప్‌ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్‌ ఏర్పాటు చేసింది. దీనిని కూడా లులు మాల్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.



ప్రస్తుత గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో ఉన్న ప్రదేశం ఒకప్పుడు విజయవాడ బస్టాండ్‌గా ఉండేది. అక్కడే విజయవాడ-1 ఆర్టీసీ డిపో సైతం ఉండేది. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ (PNBS) నిర్మాణం చేపట్టారు. ఈ బస్టాండ్ నిర్మాణం 1990లో ప్రారంభమైంది. అప్పట్లో విజయవాడ-1 ఆర్టీసీ డిపోని కూడా కొత్త బస్టాండ్‌ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. దీంతో పాత బస్టాండ్‌ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపోగా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే లులు మాల్ రానుంది.

విశాఖలో లులు గ్రూప్నకు భూమి కేటాయింపు: ఇప్పటికే విశాఖపట్నంలో లులు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. APIIC ద్వారా లులు గ్రూప్నకు విశాఖలో భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలంటూ వీఎంఆర్డీఏకు ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

maxresdefault బెజవాడ లులు మాల్.. వెనుక మతలబు వింటే షాక్..

Share this content:

Post Comment

You May Have Missed